Thursday, March 20, 2008

మన ప్రాప్తమింతే.. ప్చ్..!

సురాసురులిరువురునూ అమృతాన్ని పొందేందుకు సమానంగానే శ్రమించారు..

ఏళ్లకు ఏళ్లు వాసుకిని “పిండి” పిప్పి చేసేసారు..

అసురులైతే - ఆ అమృతం మీద మోజుతోనే మధ్య మధ్యలో చంద్రుడు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతం వంటి ఎన్ని తాయిలాలు వచ్చినా విశ్రమించకుండా కష్టించారు..

సురులు మాత్రం ఆ మాయల మరాఠిపై నమ్మకంతో నింపాదిగానే కష్టంలోనైనా సుఖించారు..

ఎందుకంటే వీళ్లు పట్టుకుంది ఆ పాముగాడి తోక భాగమాయె.. వాళ్లకేమో (దానవులకు) తల భాగం పట్టుకున్నామన్న తుత్తి తప్ప పాముగాడి సెగలు, పొగలతో మంటెక్కిపోతోంది..

సరే -

ఆ సంగతి పక్కన పెడితే,

ఎట్టకేలకు అమృతం రావడం, మోహినిగా మనోడు ఎంటరవడం, దాన్ని స్వజనులకు పంపకాలు చేసేయడం జరిగిపోయింది..

దానవులు ఓ మూల ఏడుస్తూ కూర్చున్నారట..

ఇక ఏదో విధంగా వారిని సముదాయించాలని ఒంటికన్ను గురువు శుక్రాచార్యుడు ఇలా సెలవిచ్చాడట
“నాయనలారా - అమృతం వారికి చెందాలని వ్రాసి ఉంది, మనకు ప్రాప్తం లేదు” అని..

ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే -

ఈ నా కథ చదవి తీరాలని మీకు వ్రాసి పెట్టి ఉంది కనుక.. ఏం చేద్దాం పాపం.. ప్చ్!

0 comments: