
ఏళ్లకు ఏళ్లు వాసుకిని “పిండి” పిప్పి చేసేసారు..
అసురులైతే - ఆ అమృతం మీద మోజుతోనే మధ్య మధ్యలో చంద్రుడు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతం వంటి ఎన్ని తాయిలాలు వచ్చినా విశ్రమించకుండా కష్టించారు..
సురులు మాత్రం ఆ మాయల మరాఠిపై నమ్మకంతో నింపాదిగానే కష్టంలోనైనా సుఖించారు..
ఎందుకంటే వీళ్లు పట్టుకుంది ఆ పాముగాడి తోక భాగమాయె.. వాళ్లకేమో (దానవులకు) తల భాగం పట్టుకున్నామన్న తుత్తి తప్ప పాముగాడి సెగలు, పొగలతో మంటెక్కిపోతోంది..
సరే -
ఆ సంగతి పక్కన పెడితే,
ఎట్టకేలకు అమృతం రావడం, మోహినిగా మనోడు ఎంటరవడం, దాన్ని స్వజనులకు పంపకాలు చేసేయడం జరిగిపోయింది..
దానవులు ఓ మూల ఏడుస్తూ కూర్చున్నారట..
ఇక ఏదో విధంగా వారిని సముదాయించాలని ఒంటికన్ను గురువు శుక్రాచార్యుడు ఇలా సెలవిచ్చాడట
“నాయనలారా - అమృతం వారికి చెందాలని వ్రాసి ఉంది, మనకు ప్రాప్తం లేదు” అని..
ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే -
ఈ నా కథ చదవి తీరాలని మీకు వ్రాసి పెట్టి ఉంది కనుక.. ఏం చేద్దాం పాపం.. ప్చ్!
0 comments:
Post a Comment