Saturday, March 1, 2008

హర్షవర్ధనుడా...



ఏ ముహూర్తంలో నువ్వు చెన్నపురిని వదిలి అభాగ్యుడిలా భాగ్యనగరంలో అడుగు పెట్టావో కానీ ఆ క్షణం నుంచే దానికి దౌర్భాగ్యం చుట్టుకుందిరా నిర్భాగ్యుడా...

వంతెనలు కూలిపోయాయి.. మసీదుల్లో, లుంబినీ పార్క్‌లో, గోకుల్ చాట్‌ల వంటి వరుస బాంబు పేలుళ్లతో పాటు కెకె పదవి కూడా పోయింది కదరా తుచ్ఛుడా...

అసలు కుట్రదారులు బంగ్లాదేశ్ నుంచి దేశంలోనికి అక్రమంగా చొరబడిన హుజీ సభ్యులని పోలీసు మామలు నచ్చచెబుతున్నా...

ఇంతటి దారుణానికి మూలకారణం నీ పాద మహిమే గానీ మరొకటేది కాదని నా దృఢమైన, బలమైన, ఖచ్చితమైన అభిప్రాయం...

నువ్వు కాట్రావారిపల్లె నుండి చెన్నై చేరుకున్న కాలంలోనే సునామీ సంభవించింది...

అన్న పెళ్లి సాకుతో ఆంధ్రకు చేరుకున్నప్పుడు వరదలు వెల్లువెత్తాయి...

టెస్టింగ్ కోర్సు అంటూ హైదరాబాద్ చేరుకుని దానినీ పునీతం చేసి (?) ముంచేశావు కదరా త్రాష్టుడా..మళ్లీ అడుగెట్టావు చెన్నైలో...

అదిగో అప్పుడే తుఫాను హెచ్చరికో, సునామీ హెచ్చరికో వెలువడబోతుంది..

పన్నుల రూపంలోని ప్రజల సొమ్మంతా ప్రమాద బాధితుల పేరున నాయకుల నల్ల ఖాతాల్లోకి పోతుంది కదరా...

సందేహం లేదురా..రేయ్...

ఈసారి ఏమైనా విపత్తు జరిగిందంటే...

ఖచ్చితంగా..నిన్ను నేనే చంపేస్తానురోయ్...

0 comments: