నేను గత వారం మా ఊరికి వెళ్లానోచ్...
అదిగో.. అదే తొందరంటే...
ఇందులో వింతేముంది అనుకోకండి...
ఈసారి ఎప్పటిలా శనివారం కాకుండా - శుక్రవారమే వెళ్లానన్నమాట...
ఓసోస్.. అంతేనా అని అనేసుకున్నారా?
మరదే...నాకు కాలేది...
నన్ను పూర్తిగా చెప్పనివ్వండి — ఓహ్.. సారీ - బ్లాగనివ్వండి...
మరేమో.. మొన్న ఊరికి మా అగ్రజుడి మిత్రునితో కలిసి వెళ్లానన్నమాట...
ఆ ప్రయాణంలో - మా మధ్య జరిగిన చర్చల్లో - నాకు తెలీని ఎన్నో విశేషాలను నేను తెలుసుకోగలిగాను.చర్చాంశం సాఫ్ట్వేర్ కాదు, సినిమాలు కాదు, సినీ తారల వ్యక్తిగత జీవితాలూ కాదు.. 25 నుంచి 30 ఏళ్ల కుర్రాళ్ల మధ్య ఇంతకు మించి చర్చకు మరేం ఉంటాయని మరీ అలా తీసిపారేయకండి...
మా చర్చాంశం - “రామాయణం”
పాపం ఇక్కడ ప్రస్తావించకూడనిదే గానీ.. మనోడికి ఆవేశం కూసింత జాస్తే...
ఆ మధ్య ఒక తమిళ, ప్రముఖ, వృద్ధ, రాజకీయ నాయకుడు రాముడు లేడనడాన్ని, రామాయణం కల్పితమనడాన్ని, అంతటితో ఆగకుండా రాముడు తాగుబోతు అంటూ ప్రకటనలు గుప్పించేయడాన్ని ఈయన జీర్ణించుకోలేకపోయాడు...
నీకు అసలు తమిళుల మూలం తెలుసా అంటూ మొదలెట్టాడు - తెలీదన్నా (నేను చరిత్రలో కొంచెం వీక్ మరి)...
అసలు తమిళులు రామునిపై ఇలాంటి అవాస్తవ, అసత్య ప్రచారం చేయడానికి కారణం తెలుసునా అన్నాడు.. మళ్లీ “తెలీదన్నా” అన్నా...
చెప్పనా మరి అంటూ ఊరించాడు.. ఊ కానీ.. ప్రయాణం సాగాలి కదా అనేశా...
ఇక చూస్కోండి…
అయోధ్య నుంచి రాముడు వనవాసానికి బయల్దేరడం, సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్లిపోవడం, రామలక్ష్మణులు వానరులతో జట్టు కట్టి లంకకు వారధి కట్టి, రావణాసురుని పని పట్టడం తెలిసిన విషయాలే..ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయాలేమిటంటే - సీత అగ్నిప్రవేశం, పుష్పక విమానంలో అయోధ్య ప్రయాణం వగైరా వగైరా...
కానీ మధ్యలో మరొకటుంది...
అయోధ్యకు వెళ్లేందుకు బోల్డంత మంది వానర వీరులు పుష్పక విమానంలో చేరిపోయారట..అందులో ఎంత మంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటుంది కదా...
మార్గమధ్యంలో -
వారి చిందులకు, గంతులకు అంతూ పొంతూ లేకుండా పోయిందట...
లక్ష్మణుడు, సుగ్రీవుడు ఎన్నోసార్లు హెచ్చరించారట...
వాళ్లు వచ్చినప్పుడు వీళ్లేమో “అరవం, అరవం” అనేవారట...
వాళ్లటు పోగానే మళ్లీ అదే వరుస.. ఇహ లాభం లేదనుకున్న లక్ష్మణస్వామి, సుగ్రీవుడు పుష్పక విమానాన్ని అక్కడికక్కడే దింపి, వారిలో కొందరిని అక్కడ వదిలేసి చక్కా వెళ్లిపోయారట.
అలా వదిలివేయబడిన వానరమూక అక్కడే స్థిర నివాసమేర్పరచుకున్నారట...
వాళ్ల భాష పేరు - “అరవం” అయిందట...
ఇక మరో వైపున -
రావణుని వధతో ఆయన అనుచరులైనటువంటి కొందరు రాక్షసులు, విభీషణుని పాలనను, అధికారాన్ని అంగీకరించలేక రాముడు నిర్మించిన ఆ వారధి పైనే ప్రయాణించి, ఈ అల్లరి వానర మూకలు నివసిస్తున్న ప్రాంతానికే తరలి వచ్చాయని, ఇద్దరి శత్రువు శ్రీరాముడే కాబట్టి, ఎంచక్కా కలిసిమెలిసి సహజీవనం చేసి, అలాగే స్థిరపడిపోయారట...
తమ ‘సాయం’తోనే రాముడు యుద్ధం గెలిచాడని అనుకుంటున్న వానరులకు అవసరం తీరగానే తమను అక్కడ వదిలిపోయాడని రాముడి మీద అక్కసు అట ; శ్రీరాముడు కారణంగానే తమ లంకను వదిలి ఇలా పరాయి చోట నివసించవలసి వచ్చిందనే బాధతో దానవులు - - - ఆ కారణంగానే వారి తర్వాతి తర్వాతి తర్వాతి తరం అయినటువంటి ఇప్పటి తరం వారిలో అంతర్లీనంగా ఆ కసి, పగ ఉన్నాయని, అందుకే వారు ఇలా పేట్రేగిపోతున్నారని మా అన్నగారి స్నేహితుడు తేల్చి పారేశారు.
అప్పటి నుంచి ఈ నా కొత్త జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని తెగ ప్రయత్నించేశాను.. ఇదిగో ఇప్పటికి తీరిక దొరికి బ్లాగేశా..
మరో కొత్త కథనంతో మళ్లీ కలుస్తా...
0 comments:
Post a Comment