Saturday, July 5, 2008

మా ఊరు పెద్దాయన!


మడిసన్నాక ప్రతి ఓడికీ ఎప్పుడో అప్పుడు శ్మశాన వైరేగం వచ్చే ఉంటది. ఆ మూన్నాలుగ్రోజులూ తెగ ఇదైపోతాడు. అమ్మ లేదు, ఆలి లేదు. ఏవీ వద్దంటాడు. నాకెవరూ లేరు తో మొదలై, నేనెవరు వరకు లింకులెట్టేసుకుంటూ ఆలోసనల్లో తనకలాడతాడు.తిప్పి తిప్పి సూస్తే, ఆ ముచ్చట సరిగా మూడ్రోజుల్లో మూల కూచుంటాది.

అప్పుడెతుక్కునేస్తారు, ఓరోరు మనకు బాకీలున్నారు, ఓరోరు మనకు ఏమౌతారు ఇలాంటియ్యన్నీ.. ఆ మద్దెనెప్పుడో భూమిని ముంచేసే మహా పెలయం వచ్చేస్తాందంటే మా ఊరోళ్లంతా అయినకాడికీ కయ్య, కాలవ అమ్మేసుకున బలే జల్సా చేసేసుకున్నారులే. అప్పుడేమో బూమిని కొనేవాడిని జూసి అందరా - ఏందొరే, పిచ్చేవైనానా నీకా - అంటా తెగ ఎక్కసెక్కాలాడేసుండా. మరి ఆళ్లే ఇప్పుడు లచ్చలు లచ్చలు కూడబెట్టేసి, దర్జాగా కార్లో తిరిగేస్తుండారు. ఆళ్లని జూసి ఈళ్లు వలవలా ఏడస్తండారు.

అందుకే గందా - ఈ మద్దొచ్చిన ఆ పొడవాటి ఈరో - అదేనబ్బా అవితాబో, అకితాబో సినిమాలో మాబాగ చెప్పినాల్లే

కంటి ముందుగాలె కనబడె లాబాన్ని జూసేసి సంకలు గుద్దేసుకుంటే సరిపోదంట, ఆ యెనకాల యెంబడే వచ్చే నష్టాన్నో, కష్టాన్నో కూడా చూడాలంట!

సరే ఐతే - మా ఊరు బస్సుకి యేలైంది గానె - నే పోతా ఉండానబ్బా..

0 comments: